నూతన గృహ ప్రవేశం
అనివార్య కారణాలవల్ల ఇల్లు మార్చవలసి వచ్చింది. కొత్త గృహప్రవేశానికి మీకిదే సాదర ఆహ్వానం..
http://jyothivalaboju.blogspot.com
వచ్చేయండి మరి త్వరగా…..
: నందు ఉంచబడ్డది; నల్లమోతు శ్రీధర్ సం | 4 వ్యాఖ్యానాలు »
అనివార్య కారణాలవల్ల ఇల్లు మార్చవలసి వచ్చింది. కొత్త గృహప్రవేశానికి మీకిదే సాదర ఆహ్వానం..
http://jyothivalaboju.blogspot.com
వచ్చేయండి మరి త్వరగా…..
: నందు ఉంచబడ్డది; నల్లమోతు శ్రీధర్ సం | 4 వ్యాఖ్యానాలు »
పుష్కరాల సమయంలో ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. రచన : సన్నిధానం నరసింహ శర్మ.
గోదావరి వంటి పరమ ప్రాకృతికమైన రస వస్తువుకంటే కవితా రచనకు మరొకటి తగి ఉంటుందా !.. గోదావరి గంగ కన్నా ప్రాచీనమైనది. అంతటి పవిత్రమైనది.
సుదీర్ఘ ప్రవాహ ప్రయాణాలు, కొండల స్నేహపరిమళాలు సంతరించుకోవడం , కలుపుగోలుతనంతో ఉపనదుల్ని విలీనం చేసుకోవడం, అటనట అటవీ ప్రాంతవిహారాలు బహుబాషల్ని ప్రతిధ్వనించడం, ఇలా గోదావరి దర్శనీయ కోణాలు ఎన్నో. బహు సంస్కృతుల అనుపానుల పరిణామాల ప్రత్యక్ష సాక్షి గోదావరి.
చినుకులు, వానలు, కాలువలు, వాగులు, వరదలు, పచ్చపచ్చని పంటలు వీటన్నిటితో భాషలు గోదావరి తల్లికి తెలుసు. విరగబండిన వరిచేను కంకుల గాలి మొదలికల్లో గోదారి కనబడుతుంది. నిటారుగా హుషారుగా పెరిగే చెరకు గడల్లోని గోదారి మాధుర్యం తినబడుతుంది. ఫ్యాక్టరీల్లోని పంచదారకు దారులు చూపుతుంది. ఎర్ర ఎర్రని మిరప పళ్ళల్లో గోదారి - సూర్యోదయ అస్తమయ సౌందర్య విన్యాసాలను సూక్ష్మ స్వరూప విలాసాలుగా అందిగిస్తుంది.
శ్రామికులను, నాగరికులను సమభావంతో బ్రతుకుదారుల్లో సేదదీరుస్తుంది. నాశికాత్ర్యంబకంనుండి, కడలిలో కలిసేవరకు ఒక విస్తృతమైన నడక విలాసమైన నడక. ఒక చోట చల్లగా ,, ఒక చోట వేడిగా, ఒకచోట లోతుగా, ఒక చోట ఇసుకమేటలపై తట్టులోతులు. ఇటువంటి మహానదిని గురించి సంస్కృత కవులు అనేక స్తుతులతో కవితలతో సుశ్లోకలయ్యారు.
తెలుగుకవుల స్పందనల విందారగిద్దాం మరి. నన్నయగారు ఆదిపర్వంలో “దక్షిణ గంగ నావద్దయు నొప్పిన” అని ప్రసక్తి మాత్రమే చేసినప్పటికి దక్షిణ గంగ అని ప్రశస్తి తెలిపారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి విస్తృతమైనట్లు శ్రీనాధుని కాలానికి వచ్చేటప్పటికి గోదావరి విస్తృత రచనావస్తువయింది. “త్ర్యంలుకాచల శిఖరాగ్రంబునందుండి” సముద్ర పర్యంతమూ ప్రవహించిన గోదావరిని శ్రీనాథుడు రసవత్తర పద్యాలలో ప్రతిబింబింపజేస్తూ “గౌతమీగంగ లవణాబ్దిగౌగలించే“ అంటూ ఆద్యంతం మనోహరంగా వర్ణిస్తాడు.
“కాశింజచ్చిన యంత వయంగారాని కైవల్యమ
క్లేశంబై నమవేద్యనాయకుని చే లీలాగతింజేరు రా
రో శీఘ్రంబున మర్తుయలారా! యను నారూపంబు
నమ్మోయునా కాశాస్పాలన గౌతమీజలధికీల్లోల స్థానముల్“
అంటూ శ్రీనాధమహాకవి తనన్పుకంఠంతొ మనుష్యులందర్నీ పాత్రోచితంగా ఆహ్వానించాడు. ఇందులో గోదారి పిలుపు తనకంఠంలో ప్రతిధ్వనించాడు.
“గోదావరి గోదావరి
గోదావరియంచు పల్కు గుణవంతులమేన్
గోదావరి తల్లి న
పాదింతు గదమ్మ భవ్య శుభంబుల్“
అంటూ నదీ మహాత్మ్యాన్ని తెలుపుతూ గోదావరి నామోచ్చారణతో పొంగి పులకించి పోయినవాడు శ్రీనాధుడు. తన కవితా మాధుర్యంతో “సప్తగోదావరీ జలముతేనె” అని రూఢిపరిచాడు. వార్ధులేడింటికిన్ వలపువనిత” అని గోదావరి మరో కోణంలోనూ చూపాడు. ఆ నకతశ్రేష్టుడైన శృంగారకవి “నేటివ్ స్పిరిట్” తో ” సన్నాఫ్ ది సాయిల్“గా తన వివిధ గ్రంధాలలో శ్రీనాధుడు గౌతముని ఆబగా వర్ణించాడు.
“తెలుగుల పుణ్యపేటి” పోతన్న ఆంధ్రమహాభాగవతంలో రామాయణ కథా సంధర్భంలో దండకారుణ్యం గురించి తన శైలీ సౌందర్యంతో ఇలా వ్రాశాడు.
“పుణ్యుడు రామచంద్రుడటబోయి ముదంబున గాంచె దండకా
రణ్యము తాపసోత్తమ శరణ్యము నుద్ధత బర్హి బర్హలా
వణ్యము గౌతమీ విదులావఃకణ పర్యటన ప్రభూత
ద్గుణ్యము ఉల్లసత్తురుని కుంజవరేణ్యము నగ్రగణ్యమున్ “
గోదావరి విమల జలకణాల పర్యటనలవల్ల దండకారణ్యం సద్గుణ గణ్యమైందనడం ఒక పవిత్ర కథా సందర్భ రస స్పందన!
15 వ శతాబ్దికే చెందిన ప్రగ్గడపల్లి పోతయ్య “గోదావరి” మకుటంతో ఒక శతకమే వ్రాసినట్ట్లు కవి చరిత్రకారుల వలన తెలుస్తున్నా ఆ శతక పద్యం ఒకటే ప్రసిద్ధికి వచ్చింది.. ప్రగ్గడపల్లి ” .. సురుచిరక్షోణీ పురంధ్రీ యశోధర ధమ్మిల్ల లతాంత మాలికో, భతన్వీకుచశ్రీ, హరసువ్యాసమొనాగునీదగు ప్రవాహంబొప్పు గోదావరీ ! ” అనే తన పద్యంలో భూమికి గోదావరి ఒక దండగాను, ఆ భూమికి కునంపదకు విస్తృతమైన సొగసుగాను ఉగ్గడించాడు. “హంసనింశతి” లో అయ్యలరాజు నారాయణామాత్యుడు నదులు జలపాతాలపై ఏకంగా ఇరవై నాలుగు పాదాల సీసమాలికను వ్రాశాడు. అందులో “గౌతమి” ని పేర్కొన్నాడు. టేకుమళ్ళ రంగశాయి కవి తన “వాణీ విలాస వనమాలిక ” గ్రంధంలో గౌతముడు, గోవుల కథను ప్రస్తావిస్తూ నాశిహిత్ర్యంబకునుండీ అంతర్వేది వరకూ ఉండే గోదావరిని దేవతలు, మునులు ప్రస్తుతిస్తూంటారన్నాడు.
ఒకానొక కాలంలో తెలుగులో నోబెల్ బహుమానం వస్తుందని ఆశించబడిన గ్రంధం భక్త చింతామణి. ఒకానొక కాలం నాటి సాహిత్యవేదికలు భక్త చింతామణి పద్యాలతో పులకరించిపోయాయి. ఆ గ్రంధకర్త, వేణీసంహార ఆ నాటక ఆంధ్రీకరణకర్త వడ్డాది సుబ్బారాయుడు భక్త చింతామణి మకుటంతోనే 1932 లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో అంగీరస గౌతమీ పుష్కరం శీర్శికతో వ్రాసిన పద్యాల్లో చరిత్ర నిక్షిప్తం చేశారు.
“భువన క్షేమ విధాయి పుష్కర జనంబుల్ వేనవేల్ గౌతమీ.
సవనంబాదిగ రాణ్మహేంద్రనగరిన్ సర్వాశలందుండి తీ
ర్తవిధుల్ సల్పి కొనంగ మూగెదరు : చోరవ్యాధి బాధాది వి
ప్లవ మాంగీరస నొందనీకు ప్రజ దేవా భక్త చింతామణీ “
అనడంలో యాత్రికులకు దొంగలబాధలు వంటివి లేకుండా చూడవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్ధించారు. పుష్కర దినాల్లో విమానాల్లో విహరించే జనం దేవతల్లా ఉన్నారని అందులోని వేరే పద్యాల్లో అంటారు. అంగీరస పుష్కరంలో బండ్లకు నిండ్లకు బాడుగ తగ్గెనని వ్రాశారు. అది విశేషమే. గోదావరి ప్రాంతాంలో నూతులలో నీళ్ళు, గోదావరి బాగా వచ్చేటప్పటికి పైకి వస్తుండడం వుంది. వసురాయకవి అందుకే దానిని ఎలా పోల్చాడో!
“తల్లియొఱదాక నూతులు
కల్లోలవతీమ తల్లి గౌతమి రాకన్ “
గోదావరిలో లాంచీ ప్రయాణాన్ని“గౌతమీ ధూమ నౌక విహారం” అని వ్రాసిన ఆ రోజులు చిత్రమైనవి! వసురాయకవి గోదావరి సంబంధంకంగా జలమాహత్మ్యంపైన వేరుగానూ ఎన్నో వ్రాసారు. స్థానిక ముద్ర ఈ రచనలపై ఎక్కువగా ఉంటుంది.
: నందు ఉంచబడ్డది; సాహిత్యం | 2 వ్యాఖ్యానాలు »
: నందు ఉంచబడ్డది; అభినందనలు | 7 వ్యాఖ్యానాలు »
రమణగారికి ముందుగా శతకోటి దన్యవాదములు. నాకు వ్యతిరేకంగానైనాసరే నువ్వు చేసిన ప్రచారం అభినందనీయం. దీనివల్ల నాకే లాభం కలిగింది. నా బ్లాగు విజిటర్శ్ రెట్టింపయ్యారు మూడు రోజులనుండి. నీ ప్రవర్తన , నీ బ్లాగు రచనతోనే నీ వ్యక్తిత్వం అర్ఢమైంది జీవితానుభవం లేదని. అందుకే నువ్వు అంటున్నా. నాయనా రమణ అసలు నీకు నా మీద ఎందుకింత కచ్చ. పని గట్టుకుని మరీ ఇలా దుష్ప్ర్రచారం చేస్తున్నావు. ఇది చూసి నాకు కోపం రావట్లేదు. జాలి కలుగుతుంది. చాలా రోజులుగా నా బ్లాగును క్రమం తప్పకుండా చదువుతూ ఇంత నిశితంగా విమర్శిస్తున్నావు. వేరే పనేమీ లేదా?? ఐనా నా బ్లాగులో నేనేమి రాస్తానో నీకెందుకు. నాకిష్టమైనవాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాను . నువ్వు ఎవరు నాకు సలహా ఇవ్వడానికి. నా బ్లాగులో రచనలకు నేను బాధ్యురాలిని. నీకెందుకు ఆ బాధ. రచయితలతో నేను చూసుకుంటాగా ఏ గొడవలైనా.. ఐనా నీ పేరు ఊరు చెప్పడానికి ధైర్యం లేనివాడివి ఎందుకు ఆదరాబాదరాగా బ్లాగు మొదలెట్టి , అందరి బ్లాగులకెళ్ళి లింకులిచ్చి ,, కంగారు కంగారుగా నా మీద పోస్టులు రాయడమెందుకు. ఆ కంగారులో అన్నీ మళ్ళీ మళ్ళీ పోస్టు చేసానని కూడా చూసుకోలేదు.. ఇది చదివి అందరికి కోపమొచ్చింది కాని పెంట మీద రాయేస్తే మనమీదే పడుతుందని మిన్నకున్నారు. ఇప్పటిదాకా. కాని నీకు నా విషయంలో చాలా సందేహాలున్నాయని ఇలా రాస్తున్నాను. రోజు నా బ్లాగు చూస్తావని తెలుసు కాబట్టి. నా బ్లాగు గురించిన విశ్లేషణకు కారణం తెలుసుకోవచ్చా.. దీనివల్ల నీకు లాభమేంటి. ఇలా నాకు నీతులు చెప్పాలంటే ధైర్యంగా నా బ్లాగులో కామెంట్ చెయ్యాల్సింది. పిరికివాడిలా అనవసరంగా కొత్త బ్లాగు మొదలెట్టి రాయాల్సిన అవసరమేంటి?? ఒక్కటి తెలుసుకో. ఎదుటివారిని విమర్శించడానికి ముందు నీ గురించి తెలుసుకో. ఎదుటివారిని ఒక్క వేలెత్తి చూపితే మిగతా నాలుగు వేళ్ళు నిన్ను చూపుతాయి. ధైర్యంగా నీ సొంత పేరు, వివరాలతో రాయి. ఎవరూ వచ్చి నిన్ను తన్నరు విమర్శించినందుకు.
నీకు నా రచనల గురించి చాలా సందేహాలున్నట్లున్నాయి. ఐతే రేపు ఆదివారం సాయంత్రం హైదరాబాదులో బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. సనత్నగర్ కృష్ణకాంత్ పార్కులో . నేను వస్తున్నాను. నువ్వు కూడా ఇలా బ్లాగు రాసినంత ధైర్యంగా సమావేశానికి రావచ్చు. అక్కడ మిగతా బ్లాగర్ల ముందు నీ సందేహాలన్నీ తీరుస్తా. అంతే కాని ఇలా బ్లాగ్లోకంలో నా గురించి దుష్ప్రచారం చేస్తే నాకు జరిగే నష్టమేమీ లేదు. అలా అని నేను ఊరుకునేదీ లేదు.
ఒక్కటి గుర్తుంచుకో రమణ (నీ పేరేదైనా సరే). నాకు ఇలా ఇంటర్నెట్లో రాయడంతో పాటు , ఇలాంటి చెత్త విమర్శలనుండి రక్షించుకోవడం తెలుసు. నువ్వు తప్పుడు పేరుతో అందరి బ్లాగులలో నీ బ్లాగు గురించి కామెంటు ఇచ్చినప్పుడే నీ I P అడ్రస్ తెలిసిపోయింది. దానితో నీ చిరునామా తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. నువ్వు సైబర్ కేఫ్, ఆఫీసు, ఇంటినుండి ఈ టపాలు రాసావో తెలిసిపోతుంది. అది నేను చేయగలను. ఒకె.
ఈ మధ్య బ్లాగులలో మహిళా బ్లాగర్లను లక్ష్యంగా విమర్శించడం ఎక్కువైంది. ఇది మంచిది కాదు. ఆడది ఆదరించి అమ్మలా అన్నం పెడుతుంది. ఆగ్రహిస్తే ఆదిశక్తి అవుతుంది . జాగ్రత్త..
చివరిగా ఈ అనామకులకు ఒక హెచ్చరిక…
మీరు ధైర్యంగా మీ పేరుతో వ్యాఖ్యలు రాయలేనివారు మా బ్లాగులు చదవడమెందుకు, పిరికి వాళ్ళలా anonymous అని కామెంట్లు రాయడమెందుకు. అందులోనే మీ ధైర్యసాహసాలు తెలిసిపోతున్నాయి అందరికి. మెయిల్ ఐడి లేకున్నా మీకంటు ఓ పేరుంటుందిగా. రాయడానికి భయమెందుకు. మీ వ్యాఖ్యలకు మేము కోపంతో మిమ్మల్ని వచ్చి తన్నము. కాని శృతి మించితే మాత్రం ఇవి ఎలా నిరోధించాలో మాకందరికి తెలుసు….
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 24 వ్యాఖ్యానాలు »
అనునిత్యం మనం అనేక పనుల్ని చేస్తుంటాం.. వాటిలో కొన్ని పనుల్ని చేసేటప్పుడు చాలా ఆనందాన్ని పొందుతుంటాం, కొన్నింటిని విధిలేక ఈసురోమంటూ ఎలాగో పూర్తి చేస్తాం. నచ్చని పనుల్ని చేసేటప్పుడు శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో వత్తిడికి లోనవుతుంటాం…. ఆనందంగా చేసే పనులు మాత్రం అప్పుడే పూర్తయిందా అన్నంత హుషారుతో నిర్వర్తించడం జరుగుతుంది. ఒకే పని, ఇలా వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలను ఎందుకు మిగుల్చుతోంది అన్నది ఆ పనిని వారు స్వీకరించే మానసిక స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే.. స్వతహాగా మీకు నచ్చకపోయినా… చేసే పని పట్ల ఇష్టాన్ని పెంచుకుని చేస్తే అది భారంగా ఉండకపోగా అంతకు ముందెన్నడూ ఆ పనిలో రుచి చూడని సంతృప్తిని మిగుల్చుతుందన్నది నగ్న సత్యం. అంటే ఇక్కడ మనం ఏవేవి ఇష్టాలు అనుకుంటున్నామో అవన్నీ మన మనసులో గిరిగీసుకు కూర్చున్న తాత్కాలికమైన పరిమితులు అన్న విషయం అర్ధమవుతుంది. ఆ పరిమితులు, పరిధుల్ని చెరిపివేస్తే ప్రతీదీ ఆనందం అందించేదే!!!
ప్రతీ పనీ సులభమైనదే! ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎవరైనా చాలా ఉత్సాహంగా, తానొక్కడే ఆ సంస్థని నడిపిస్తున్నంత శక్తివంతంగా పనిచేస్తారు. కాలం గడిచేకొద్దీ వృత్తి పట్ల నిరాసక్త ఆరంభమవుతుంది. ఎప్పుడైతే నిరాసక్తత ఏర్పడిందో అంతకుముందు క్షణాల్లో పూర్తయ్యే పనిని పూర్తి చెయ్యడానికి సైతం మానసికంగానూ, శారీరకంగానూ ఎంతో కష్టపడి చేయాల్సి వస్తుంటుంది. చాలామంది… శ్రమించి శ్రమించీ తాము శారీరకంగా, మానసికంగా అలసిపోయామని భావిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇష్టమైన పనిని చేసేటప్పుడు ఎప్పుడూ శరీరం , మనస్సు అలసిపోవు.అవలీలగా ఆ పనులు పూర్తవుతాయి. మారుతుందల్లా ఆ వృత్తి పట్ల, మనం చేసే పనుల పట్ల మనకు గల దృక్పధమే. ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం లేదనో, ఆర్ధికంగా ఎదుగుదల లేదనో. ఇతరత్రా కారణాల వల్లనో మనకు మనం మనల్ని పోషిస్తున్న వృత్తుల పట్ల నిరాసక్తతని పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే ఇంత చేస్తున్నా ఏమీ ప్రయోజనం చేకూరడం లేదన్న ప్రతిఫలాపేక్ష మనసుని కమ్ముకుంటుందో అప్పుడు చేసే ప్రతీ పనీ ఎదో రూపేణా ప్రయోజనం ఉన్నదే చేయాలన్న స్వార్ధం జడలు విప్పుతుంది. దీనితో పనిపట్ల అంకితభావం, ఆనందం కొరవడుతుంది. దీంతో పనే భారం అవుతుంది. పనే భారమైతే కొన్నాళ్ళకు మనకు మనమే భారమవుతాము. చేసే పనినే దైవంగా స్వీకరించి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడంలోనే ఆనందాన్ని పొందగలిగే మానసిక స్థాయిని పొందినప్పుడే మన పనులు మనకు భారం కావు. మన మనస్సు ఎప్పుడూ ఆనందంతో , సంతృప్తితో నిండి వుంటుంది..
: నందు ఉంచబడ్డది; శ్రీధర్ సంపాదకీయాలు | అభిప్రాయాలు లేవు »