కలసి ఉంటే కలదు సుఖం

                          
నేటి రోజులలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. తల్లితండ్రులు కూడా బరువైపోయారు.
వాళ్ళను పంచుకుంటున్నారు లేకుంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. రెండు రోజుల క్రింద
వార్తలలో చదివా. పశ్చిమ బెంగాల్‍లో ఒక కుటుంబంలో మొత్తం 108 మంది ఒకే ఇంట్లో
కలిసి మెలసి ఉంటున్నారు. నిజమండీ అక్షరాలా108 మంది ఒకే దగ్గర ఉంటున్నారు.
అది సమంతా పరివారం. ఫర్నీచర్ వ్యాపారం. ఐదుగురు అన్నదమ్ముల పరివారం
చిన్నా పెద్దా కలిసి ఉంటున్నారు. రోజుకు 20 కిలోల చేపలు, 30కిలోల కూరగాయలు
 అవసరమవుతాయంట. ఉదయం ఐదు గంటలనుండి అర్దరాత్రివరకు పొయ్యి
వెలుగుతూనే [...]