కొత్త పుస్తకాలు
రాసినది జ్యోతి పై జూన్ 14, 2007
వాజ్మయ సుధా తరంగాలు
అరిషడ్వర్గాలను జయించవలసిన ఆవశ్యకతను , ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి వుండాలని సంస్కృత సూక్తులతో సులభశైలిలో చక్కగా వివరించే వ్యాస సంకలనమిది.
రచన : సముద్రాల శఠకోపాచార్య
పుటలు : 81
వెల : రు.25
ప్రతులకు :
సముద్రాల వెంకటా నర్సింహాచార్యులుగారు,
శ్రీనివాస నిలయం, 2-5-318
నక్కలగుట్ట, హన్మకొండ – వరంగల్ జిల్లా
పాత్రికేయ పాళి
ఆచార్య తిరుమల రామచంద్ర, ఆలపాటి రవీంద్రనాథ్,ఎ.బి.కె ప్రసాద్,టంకశాల అశోక్, పొత్తూరి వెంకటేశ్వరరావు,కె.రామచంద్రమూర్తి, ఎం.వి.ఆర్.సాస్త్రి తదితర పాత్రికేయ ప్రముఖులు, సంపాదకుల రచనల నుంచి చేసిన విశ్లేషణల మాలిక ఇది.
రచన: నాగసూరి వేణుగోపాల్
పుటలు : 53,
ప్రతులకు:
ఆకాష్ పబ్లికేషన్స్,
జి.14, ఇండస్ట్రియల్ ఎస్టేట్,
సామర్లకోట -533440
శ్రీమతి నాగసూరి హంసవర్ధిని
డి-1,ఎ.ఐ.ఆర్ క్వార్టర్స్, సిరిపురం
వైజాగ్-530003
కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం స్వీయచరిత్ర
ఆంధ్రుల అభ్యుదయానికి తోడ్పడే అనేక గ్రంధాలను రచించిన కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్ర ఇది. ఆనాటి సమాజ పరిస్థితులను హృద్యంగా వర్ణించే ఈ గ్రంధం మనం నేర్చుకోవల్సిన ఎన్నో గుణపాఠాలను, అనుభవాలను నేర్పుతుంది.
పుటలు : 271
వెల : రూ.100
ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
హైదరాబాదు మరియు అన్ని బ్రాంచీలు
సూక్తి సౌరభం
సూక్తి సౌరభం, భావపద సౌరవ్భం, జీవజంతు స్వభావం, భావ సూచిక అను నాలుగు విభాగాలుగా పొందుపరచిన ఈ సంకలనంలో పలు తేట తెలుగు నుడికారాలు, జాతీయాలు, పలుకుబడులు, పదబంధాలు వున్నాయి. ప్రాచీన సాహిత్యం నుంచి ఈనాటి పత్రికల వరకు వచ్చిన నానుడులు ఎన్నో వున్న ఈ పుస్తకం ప్రతి ఒక్కరి పుస్తక భాండాగారంలో చోటు చేసుకోతగ్గది.
సంకలనం : ముప్పాళ్ళ వెంకట సత్యనారాయణ ప్రసాద్
పుటలు : 287
వెల : రూ. 85
ప్రతులకు : విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని బ్రాంచీలు మరియు ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు