తద్దినం - అవసరమా???
అందరికీ తెలిసిన విషయమే. చనిపోయిన పెద్దలకు మర్చిపోకుండా తద్దినం పెట్టాలి అని పెడుతున్నాం కూడా. కాని ఈ విషయంలో నాకు ఎన్నో సందేహాలు. చనిపోయినవారి స్మ్త్యత్యర్ధం అలా చేయడం మంచిదే. కాని మనం అది సక్రమంగా నిర్వహిస్తున్నామా. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టకుంటే ఏమవుతుంది. ఎంతమంది మనస్పూర్తిగా చేస్తున్నారు. నిజంగా మన పెద్దలు సంతోషిస్తున్నారా? మేము చనిపోయాక కూడా మా పిల్లలు మమ్మల్ని గుర్తుంచుకున్నారు అని.
తద్దినం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?చేయకపోతే ఏమవుతుంది??
నేను గమనించినదేమంటే పెద్దవాళ్ళ తద్దినం రోజు చనిపోయినవారి ఫోటో తుడిచి(అదీ ఏడాదికొక్కసారే) పూలదండ వేసి బొట్టు పెట్టి, నైవేద్యం పెట్టి, మిగతావాళ్ళూ తినడం, తాగడం. ఇదేనా వారి ఆత్మశాంతి. చనిపోయినవారి పేరు చెప్పుకుని మనం సుష్టిగా తినడం, తాగడం. రోజు వండుకోకపోయినా ఆ రోజు మాత్రం మాంసాహారం(తినేవాళ్ళు) , పూరీలు, గారెలు, చేయాల్సిందే. లేకుంటే చుట్టాలు విసుక్కుంటారు. ఏం తిండి పెట్టారు అని. మందు కూడా తప్పనిసరి. అసలు అది ఒక పార్టీలా చేసుకుంటారు. .ఇక ఒకరికంటే ఎక్కువ కొడుకులుంటే సంవత్సరానికొక్కడు ఈ తద్దినం తనింట్లో పెడతానని వంతులు వేసుకుంటారు. ఇంట్లో కోడళ్ళు ఉంటే మీ అత్తమామకి మీరు చేసుకోండి మేమెందుకు చేయాలి పని అంటారు. మరి వాళ్ళ మొగుళ్ళు ఎక్కడినుండి ఊడిపడ్డారో (తాత, బామ్మలు లేకుండా).. ఇది ఒక బలవంతపు తంతులా చేసుకుంటారు.. ఆర్ధిక ఇబ్బంది ఉన్నా చేయక తప్పదు అన్ని రకాల వంటకాలు. ఇదంతా ఎవరి కోసం.ఎవరి పేరు చెప్పి ఎవరు తింటున్నారు. ఇది సమంజసమేనా??
ఐనా ఆ పెద్దలు కాని, ఏ దేవుడు కాని చెప్పాడా నాయనల్లారా! నేను పోయాక ఇలా చేయండి అని. అలా చేస్తే నేను సంతోషిస్తాను అని (బ్రతికున్నపుడు ఏం చూసుకున్నారో ఆ తల్లితండ్రులని ఈ పుత్ర రత్నాలు). చనిపోయాక చచ్చినరోజని తద్దినం పెడతారుగా మరి బ్రతికున్నపుడు ఆ మనిషి పుట్టినరోజు చేసారా. కనీసం వారికి పాదాభివందనం చేసి అభినందనలు చెప్పారా ఎవరైనా?? మరి మనిషి బ్రతికున్నాడన్న నిదర్శనానికి పుట్టినరోజు చేయనివాళ్ళు, ఆ మనిషి చనిపోయాక చచ్చినరోజు అని తద్దినం పెట్టి ఈ తినడాలు, తాగడాలు ఏంటో???
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు

ఆ రోజు చేసే కర్మ మూడు తరాలవారిని ఉద్దేశించి.కాని బతికి ఉండగా చూసుకోని పుత్రరత్నం చచ్చాక తద్దినం పెడతాడంటారా?అయినా ఈకాలములొ ఎంతమంది తద్దినం పెడుతున్నారు.
జ్యోతి గారు,
తనువు చాలించిన తరువాత ఒక దినం (తద్దినం) అవసరం. నలుగురు చేరి అవిడ/అయన చేసిన మంచి చెడుల గురించి చెప్పుకోని నేర్చుకోనే సమయం అది. అని గొప్పలకు పోతే ఉన్న డబ్బులు గోవిందా సుమా! అరోజుల్లో మనుష్యులకు ఇప్పటిలాగా బ్లాగులు/జీవిత కధలు (autobiography) లేవుకదా మరి (ఇవి ఉంటే అవసరం లేదు మరి), అని నా అలోచన. సగటు మనిషికి సుష్టిగా తిన్న తరువాత కదా మంచి అలోచనలు వస్తాయి (ఇప్పటి వారికి (హైటెక్ మనిషికి) అయితే నాలుగు బీరుకాయలు కూడా కావాలి మరి)!
-మరమరాలు
బాగా చెప్పారు. ప్రపంచంలోని అన్ని జాతుల మానవులూ చనిపోయినవారిని గౌరవించడానికి, గుర్తు చేసుకోవడానికి ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. సాంప్రదాయకమైన చాలా విషయాల్లాగే ఈ సమకాలీన జీవతంలో ఇవీ వెర్రి తలలు వేస్తున్నాయి.